వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భక్తి శ్రద్ధలతో శివరాత్రి పర్వదినం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: శివరాత్రి పర్వదినాన్ని రాష్ట్ర ప్రజలు శనివారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. రాష్ట్రంలోని శైవక్షేత్రాలు, శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శివాలయాల్లో చండీయాగాలు, రుద్ర యాగాలు చేశారు.

శ్రీశైలం భక్తులతో క్రిక్కిరిసిపోయింది. శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుక ఇసుకవేస్తే రాలనంత జనం వచ్చారు. దీంతో దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వచ్చింది. భక్తులు కృష్ణానదిలో పవిత్ర స్నానాలు ఆచరించి భగవంతుడ్ని దర్శించుకున్నారు. భక్తుల సంఖ్య పెరగడం వల్ల ఇబ్బందులు తప్పలేదని, వచ్చే ఏడాది భక్తులకు ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు చెప్పారు. హైదరాబాద్‌ శృంగేరీ శారదా పీఠంలో చండీయాగం నిర్వహించారు. వరంగల్‌ వేయిస్తంభాల గుడిలో భక్తులు పూజలు నిర్వహించారు. క్షీరాభిషేకాలు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X