వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ముషారఫ్పై భారత్ ధ్వజం
న్యూఢిల్లీ:
పాకిస్థాన్
అధ్యక్షుడు
పర్వేజ్
ముషారఫ్
చేసిన
వ్యాఖ్యాలను
భారత్
తిప్పికొట్టింది.
జమ్మూ
కాశ్మీర్లో
సీమాంతర
ఉగ్రవాదానికి
స్వస్తి
పలికే
విషయంలో
ముషారఫ్
నిబద్ధతను,
అంతర్జాతీయ
కర్తవ్యాలను
నిర్వర్తించడం
లేదని
శనివారం
విమర్శించింది.
ముషారఫ్ పాకిస్థాన్ వాస్తవ ఉద్దేశ్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి నవతేజ్ శర్న అన్నారు. జమ్మూ కాశ్మీర్లో పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందనే భారత్ విమర్శపై ముషార్రఫ్ ధ్వజమెత్తుతూ కాశ్మీర్ ప్రజలు స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారని ఒక టెలివిజన్ చానల్కిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. పాకిస్థాన్ను కేవలం మీడియాలో వచ్చే ప్రకటనల ద్వారా అంచనా వేయకూడదని, దాని ఆచరణ ద్వారా అంచనా వేయాలని శర్న అన్నారు.
Comments
Story first published: Sunday, March 2, 2003, 23:53 [IST]