వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాజ్‌పేయి, అద్వానీల ప్రాణాలకు ముప్పు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత్‌లో ఆత్మాహుతి దాడులకు పాల్పడడంతో పాటు ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి, ఉప ప్రధాని ఎల్‌.కె. అద్వానీలను టార్గెట్‌ చేసుకున్నట్లు లష్కర్‌-ఎ- తోయిబా ప్రకటించింది.

టేప్‌ చేసిన లష్కర్‌-ఎ- తోయిబా ఛీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ ప్రసంగాన్ని పాకిస్తాన్‌ వార పత్రిక ది ఫ్రైడే టైమ్స్‌ ప్రచురించింది. తాము ఆత్మాహుతి దాడులకు సిద్ధపడుతున్నామని, అందుకు తమ యోధులు ఈ బాధ్యతను నెరవేరుస్తారని హఫీజ్‌ అన్నట్లు ఆ పత్రిక రాసింది. అద్వానీకి రోజులు దగ్గర పడ్డాయని హఫీజ్‌ అన్నట్లు కూడా ఆ పత్రిక రాసింది. ముషారఫ్‌కు గానీ, ఆయన ప్రభుత్వానికి గానీ తాము లొంగి ప్రవర్తించబోమని హఫీజ్‌ స్పష్టం చేసినట్లు కూడా ఆ పత్రిక రాసింది. హఫీజ్‌ మాటలను యథాతదంగా ఆ పత్రిక ఉటంకించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X