వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్‌సిపి సంసిద్ధత

By Staff
|
Google Oneindia TeluguNews

షిలాంగ్‌: మేఘాలయలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సిపి) లెజిస్లేచర్‌ పార్టీ నేత ఇ.డి. మారక్‌ సోమవారం చెప్పారు. ఎన్‌సిపి లెజిస్లేచర్‌ పార్టీ నేతగా మారక్‌ ఆదివారంనాడు ఎన్నికయ్యారు.

ఎన్‌సిపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రాబర్ట్‌ ఖార్సింగ్‌తో కలిసి మారక్‌ ఆదివారం రాత్రి గవర్నర్‌ ఎం.ఎం. జాకబ్‌ను కలిశాం. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తమకు తగిన మెజారిటీ ఉన్నదని వారు గవర్నర్‌కు చెప్పారు. కాంగ్రెస్‌ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. 60 సభ్యులతో కూడిన హంగ్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌ 22 సీట్లు దక్కించుకుని అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఎన్‌సిపికి 14 సీట్లు దక్కాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X