అసెంబ్లీ నుంచి కాంగ్రెస్, సిపిఎం వాకౌట్
హైదరాబాద్:
బాలికా
శిశు
సంరక్షణ
పథకం
అమలుపై
సోమవారం
శాసనసభ
ప్రశ్నోత్తరాల
సమయంలో
అధికార,
ప్రతిపక్ష
సభ్యుల
మధ్య
తీవ్ర
వాగ్వివాదం
చెలరేగింది.
ప్రభుత్వ
సమాధానానికి
సంతృప్తి
చెందని
కాంగ్రెస్,
సిపిఎం
సభ్యులు
సభ
నుంచి
వాకౌట్
చేశారు.
పథకం అమలుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ప్రతిపక్షాలు విమర్శించాయి. బాలికా శిశు సంక్షేమ పథకం అమలును కాంగ్రెస్, బిజెపి సభ్యులు ప్రశ్నోత్తరాల సమయంలో సభలో లేవనెత్తారు. ఈ పథకం కింద ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేశామని, ఈ పథకం కింద 2 లక్షల 60 వేల మంది లబ్ధి పొందారని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సరస్వతి ఇచ్చిన సమాధానంతో ప్రతిపక్ష సభ్యులు సంతృప్తి చెందలేదు.
పుట్టిన ప్రతి ఆడిశిశువు పేరునా ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఓటర్లను ప్రలోభ పెట్టారని, ఈ పథకాన్ని అమలు చేయలేక చేతులెత్తాశరని ప్రతిపక్ష నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. పథకాన్ని కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని తెలుగు దేశం సభ్యులు విరుచుకుపడ్డారు. ఈ స్థితిలో అధికార తెలుగుదేశం, ప్రతిపక్షాల సభ్యుల మధ్య దాదాపు గంట సేపు వాగ్వివాదం చెలరేగింది. ప్రభుత్వ సమాధానంతో సంతృప్తి చెందని కాంగ్రెస్, సిపిఎం సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.