వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బ్యాక్ లాగ్ పోస్టులపై రభస
హైదరాబాద్ఃఆంధ్రప్రదేశ్ పబ్లిక్సర్వీస్ కమిషన్ బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీచేయాలన్న డిమాండ్ పై చర్చ కోసం సిపిఎం,బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఇచ్చిన వాయిదా తీర్మానంనోటీసును గురువారం స్పీకరు ప్రతిభా భారతి తిరస్కరించడంపైఅసెంబ్లీలో గంద్రగోళం చెలరేగింది.
ఎపిపిఎస్ సి పై కాంగ్రెస్ వారు దాడిచేయడాన్ని తెలుగుదేశం సభ్యులు తీవ్రంగా విమర్శించారు. ఒకదశలో హోం మంత్రి దేవేందర్ గౌడ్ ప్రతిపక్షనాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డిపై వ్యక్తిగతవిమర్శలకు దిగారు. ఈ అంశంపై దాదాపు గంటన్నరసేపు వాగ్వివాదాలు జరిగాయి.
Comments
Story first published: Thursday, March 6, 2003, 23:53 [IST]