వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తొక్కిసలాటపై దర్యాప్తు: దేవేందర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: నగరంలోని ఎన్టీఆర్‌ స్టేడియంలో శుక్రవారం అర్థరాత్రి జరిగిన తొక్కిసలాటపై సమగ్ర దర్యాప్తు జరిపించనున్నట్లు హోం మంత్రి టి. దేవేందర్‌ గౌడ్‌ చెప్పారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో శుక్రవారం దళితస్త్రీ భూపోరాట మహాసభ జరిగింది. అయితే అర్థరాత్రి దాటిన తర్వాత సభా ప్రాంగణం ద్వారం వద్ద తొక్కిసలాట జరగడంతో ఒక మహిళ మరణించింది. పలువురు గాయపడ్డారు.

బాంబులు పేలినట్లు ఊహాగానాలు చెలరేగడం వల్లనే ఈ తొక్కిసలాట జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఊహాగానాలకువిద్రోహ చర్యే కారణం కావచ్చుననే వార్తలను ఆయన ఖండించారు. రెండు రోజుల పాటు తలపెట్టిన దళితస్త్రీ భూపోరాట సభల్లో తొలిరోజు శుక్రవారం ఏడు గంటల వరకు వక్తలు ప్రసంగించారు. సమావేశాలు ముగిసే సమయానికి ఎన్టీఆర్‌ స్టేడియంలో 40 వేల మంది దాకా వున్నారు. రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో అక్కడే ఏర్పాటు చేసిన భోజనాలు ముగించుకుని పలువురు మహిళలు నిద్రకు ఉపక్రమించారు.

అర్థరాత్రి 12 గంటలు దాటిన తర్వాత అక్కడి ఒకపెళ్లి ఊరేగింపులో పెద్ద ఎత్తున బాణా సంచా పేల్చారు. దాంతో బాంబులు వేస్తున్నట్లు భయపడిన మహిళలు ఒక్కసారిగా స్టేడియం ద్వారం వైపు పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో తెనాలికి చెందిన కృష్ణకుమారి అనే మహిళ మరణించింది. మరో 15 మంది దాకా గాయపడ్డారు. గాయపడినవారిని ఆస్పత్రిలో చేర్పించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X