వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మహిళాబిల్లుపై సోనియా నమ్మకం!
రాయ్ పూర్: మహిళారిజర్వేషన్ల బిల్లు వివాదంలో సానుకూల ఫలితమే వెలువడుతుందనికాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆశాభావంవ్యక్తం చేశారు. దీనిపై కాంగ్రెస్ వైఖరిసుస్పష్టం. మహిళలకు చట్టసభల్లోరిజర్వేషన్లు కల్పించడానికి మేం పూర్తిగా అనుకూలం.రాజకీయపార్టీలన్ని కూడా దీనిపై ఏకతాటిన నిలుస్తున్నాయి.
స్వల్ప విభేదాల నుంచి సానుకూల ఫలితమే వెలువడుతుందనిఅనుకుంటున్నాని సోనియాగాంధీ మహిళాదినోత్సవాన్ని సందర్భంగా ఒక ప్రకటనచేశారు. రాయ్ పూర్ కు ముఫ్ఫై కిలోమీటర్లదూరంలోని పౌంటా వద్ద కొత్త రాజధాని నిర్మాణం పనులనుఆవిష్కరించేందుకు సోనియాగాంధీ శనివారంఇక్కడికి విచ్చేశారు. పార్టీ కార్యదర్శి అంబికా సోని, సీనియర్నాయకులు మోతీలాల్ వోరా తదితరులు ఆమెవెంట విచ్చేశారు. మహిళలకు సాధికారికత కల్పించనంతవరకు భారతదేశం సమగ్రంగా అభివృద్దిసాధించలేదని ఆమె ఆ ప్రకటనలో అభిప్రాయపడ్డారు.
Comments
Story first published: Saturday, March 8, 2003, 23:53 [IST]