ఘోర ప్రమాదం: 17 మంది మృతి
దిండిగల్:
తమిళనాడులో
ఆదివారం
ఉదయం
జరిగినఘోర
రోడ్డు
ప్రమాదంలో
17
మంది
మరణించారు.
మరణించినవారిలో
ఏడుగురు
మహిళలు,
ఇద్దరు
పిల్లలు
ఉన్నారు.
మరో
13
మంది
గాయపడ్డారు.
వ్యాన్ను
బస్సు
ఢీకొట్టడంతో
ఈ
దుర్ఘటన
సంభవించింది.
మృతులందరూ వ్యాన్లో ప్రయాణిస్తున్నవారే.వీరు కేరళలోని ఎర్నాకులం సమీపంలో గల ఇడియకట్టుకు చెందినవారు. తిరువూరు జిల్లాలోని వెలంకన్నికి వెళ్లి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. వ్యాన్ డ్రైవర్ వ్యాన్ను నియంత్రించలేకపోయాడని, బస్సును ఢీకొట్టడానికి ముందు వ్యాన్ రోడ్డుపై జిగ్జాగ్గా వెళ్తుండగా చూశామని ప్రత్యక్ష సాక్షులు చెప్పారని పోలీసులువివరించారు. ఎనమండుగురు పురుషులు, ఏడుగురు మహిళలు, ఒక పసిపాప అక్కడికక్కడే మరణించగా మరో 18 నెలల పసిపాప ఆస్పత్రిలో మరణించినట్లు తెలిపారు.
గాయపడినవారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.వీరు దిండిగల్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నారు. బస్సు డ్రైవర్కు, మరో ఎనమండుగురు ప్రయాణికులకుస్వల్ప గాయాలయ్యాయి. తలకు గాయం తగిలిన కండక్టర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.