పత్తి రైతులకు నష్టపరిహారం: వడ్డే
హైదరాబాద్:
బి.టి.
కాటన్
విత్తనాలు
వేసి
నష్టపోయిన
రైతులకు
నష్టపరిహారం
ఇప్పిస్తామని
వ్యవసాయ
శాఖ
మంత్రి
వడ్డే
శోభనాద్రీశ్వరరావు
చెప్పారు.
సోమవారం
శాసనసభ
ప్రశ్నోత్తరాల
సమయంలో
సభ్యులు
అడిగిన
ప్రశ్నలకు
సమాధానమిస్తూ
మంత్రి
ఈవిషయం
చెప్పారు.
విత్తనాల కంపెనీలతో చేసుకున్న ఒప్పందాల ప్రకారం నష్టపోయిన పత్తి రైతులకు నష్టపరిహారం ఇప్పిస్తామని, నష్టపోయిన రైతులవివరాలు సేకరించి అందుకు సహకరిస్తామని ఆయన చెప్పారు. అంతకు ముందు కాంగ్రెస్ సభ్యుడుపి. శంకరరావు మాట్లాడుతూ- మైకో, మోనోసాంటో పత్తి విత్తనాలు వేసిన రైతులు నష్టపోయారని, గుంటూరు, కరీంనగర్, వరంగల్, మహబూబ్నగర్ జిల్లాల్లోని రైతులు తీవ్ర నష్టాలకు గురయ్యారని ఆయన అన్నారు. ఈ విత్తనాలు వేసిన రైతులు పంటకు రోగాలు తగిలి, దిగుబడి సరిగా నష్టపోయారని కాంగ్రెస్ సభ్యుడు జీవన్ రెడ్డి అన్నారు. ఒప్పందాన్ని ఉల్లంఘించి రైతులను నష్టపరిచిన విత్తనాల కంపెనీలను బ్లాక్ లిస్టులోపెట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.