వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నియామకాలపై విపక్షాల వాకౌట్
హైదరాబాద్:
ఆంధ్రప్రదేశ్
పబ్లిక్సర్వీస్
కమిషన్
ద్వారా
ఉద్యోగ
నియామకాలు
ఆపేసినందుకు
నిరసనగా
కాంగ్రెస్,
సిపిఎం
సభ్యులు
మంగళవారం
శాసనసభ
నుంచి
వాకౌట్
చేశారు.
ఉద్యోగాలు
ఖాళీగా
ఉన్నప్పటికీ
పబ్లిక్సర్వీస్
కమిషన్
నియామకాలు
జరపడం
లేదని
వారు
శాసనసభ
ప్రశ్నోత్తరాల
సమయంలోవిమర్శించారు.
రాష్ట్రంలో రెండున్నర లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని,అయినప్పటికీ గత ఐదేళ్లుగా ఆ ఖాళీలను భర్తీ చేయడం లేదని ప్రతిపక్షాల సభ్యులన్నారు. నియామకాలు జరపని పబ్లిక్సర్వీస్ కమీషన్ రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. లక్షా 46 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, అవసరాన్ని బట్టి నియామకాలు జరుపుతామని రెవెన్యూ మంత్రిపి. అశోకగజపతి రాజు చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల నియామకాలు జరపడం లేదని ఆయన చెప్పారు. మంత్రి సమాధానానికి తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్, సిపిఎం వాకౌట్ చేశాయి.
Comments
Story first published: Tuesday, March 11, 2003, 23:53 [IST]