ఇళ్ల నిర్మాణంపై కాంగ్రెస్ ధ్వజం
హైదరాబాద్:
బలహీన
వర్గాల
గృహ
నిర్మాణ
పథకం
యూనిట్
ఖర్చును
17,500
నుంచి
22,500
రూపాయలకుపెంచినట్లు
గృహనిర్మాణ
శాఖ
మంత్రి
రామసుబ్బారెడ్డి
చెప్పారు.
సభ్యులు
అడిగిన
ప్రశ్నలకు
సమాధానమిస్తూ
బుధవారం
శాసనసభలో
ఆయన
ఈవిషయం
చెప్పారు.
ప్రభుత్వం ఏడాదికి ఏడు లక్షల గృహాలు నిర్మిస్తామని ఇచ్చిన హామీని నిలటెట్టుకోవడంలోవిఫలమైందని కాంగ్రెస్ విమర్శించింది. ఏడాదికి ఏడు లక్షల గృహాలు నిర్మిస్తామనితెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిందని, ఈ హామీని నిలబెట్టుకోవడంలోవిఫలమైందని సిఎల్పి నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు.
ఈ సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జోక్యం చేసుకున్నారు. ప్రభుత్వం 2003-04 సంవత్సరంలో 4 లక్షల 75 వేల గృహాల నిర్మాణం చేపట్టి పూర్తి చేస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. అయితే రాజశేఖర్ రెడ్డి ఈ సమాధానంతో సంతృప్తి చెందలేదు. ఎన్నికల హామీలకు, ఆచరణకు మధ్య ఇంత తేడా ఎందుకుంటోందని ఆయన ప్రశ్నించారు. హామీ ప్రకారం ఇప్పటి వరకు 25 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలని, కానీ ఐదు లక్షల ఇళ్లు కూడా కట్టలేదని ఆయన అన్నారు.