వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇళ్ల నిర్మాణంపై కాంగ్రెస్‌ ధ్వజం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: బలహీన వర్గాల గృహ నిర్మాణ పథకం యూనిట్‌ ఖర్చును 17,500 నుంచి 22,500 రూపాయలకుపెంచినట్లు గృహనిర్మాణ శాఖ మంత్రి రామసుబ్బారెడ్డి చెప్పారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ బుధవారం శాసనసభలో ఆయన ఈవిషయం చెప్పారు.

ప్రభుత్వం ఏడాదికి ఏడు లక్షల గృహాలు నిర్మిస్తామని ఇచ్చిన హామీని నిలటెట్టుకోవడంలోవిఫలమైందని కాంగ్రెస్‌ విమర్శించింది. ఏడాదికి ఏడు లక్షల గృహాలు నిర్మిస్తామనితెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిందని, ఈ హామీని నిలబెట్టుకోవడంలోవిఫలమైందని సిఎల్‌పి నేత డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి అన్నారు.

ఈ సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జోక్యం చేసుకున్నారు. ప్రభుత్వం 2003-04 సంవత్సరంలో 4 లక్షల 75 వేల గృహాల నిర్మాణం చేపట్టి పూర్తి చేస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. అయితే రాజశేఖర్‌ రెడ్డి ఈ సమాధానంతో సంతృప్తి చెందలేదు. ఎన్నికల హామీలకు, ఆచరణకు మధ్య ఇంత తేడా ఎందుకుంటోందని ఆయన ప్రశ్నించారు. హామీ ప్రకారం ఇప్పటి వరకు 25 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలని, కానీ ఐదు లక్షల ఇళ్లు కూడా కట్టలేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X