వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సచిన్‌ టార్గెట్‌ గా కివీస్‌ వ్యూహం!

By Staff
|
Google Oneindia TeluguNews

జోహెన్నస్‌ బర్గ్‌: భారత్‌తో శుక్రవారం జరగనున్న కీలకమైన సూపర్‌సిక్స్‌ మ్యాచ్‌ లో న్యూజీలాండ్‌ స్టార్‌ బ్యాట్స్‌ మెన్‌సచిన్‌ టెండూల్కర్‌ ను టార్గెట్‌ గా పెట్టుకొంది.సచిన్‌ ను పది ఓవర్లలోపే ఔట్‌ చేయడమేలక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్నికివీస్‌ కోచ్‌ డెన్నిస్‌ అబర్‌ హార్ట్‌ గురువారంఅంగీకరించాడు.

సచిన్‌ విఫలం కావాలనికోరుకుంటున్నాం. అయితే, సచిన్‌ ఒక్కడే మా టార్గెట్‌కాదని ఆయన విలేకరులకు తెలిపాడు. సెమీస్‌కు చేరాలంటే భారత్‌ ను ఓడించడం కివీస్‌కు తప్పనిసరి. ఈ మ్యాచ్‌ గెలిచేందుకు సర్వశక్తులుఒడ్డించేందుకు కివీస్‌ సిద్దంగా ఉంది. కాకపోతే,జమాలెక్కలను చూసుకునే మ్యాచ్‌ గా దీన్నిపరిగణించకూడదని భారత్‌ కు ఆయన హితవుపలికాడు. మరోవైప్‌, కివీస్‌ ఆల్‌ రౌండర్‌ క్రిస్‌కెయిన్స్‌- సచిన్‌ వికెటే కీలకమని అభిప్రాయంవ్యక్తం చేశాడు.

భారత్‌ తరఫునదాదాపు 70 శాతం పరుగులు సచినే రాబడుతున్నాడు.కాబట్టి సచిన్‌ వికెట్‌ ను త్వరగా పడగొడితేసగం పని పూర్తయినట్లేనని క్రెయిన్స్‌ అభిప్రాయపడ్డాడు.అయితే, భారత్‌ పేస్‌ బౌలర్లు కూడా ఇప్పుడు ప్రమాదకరంగాకన్పిస్తున్నారని క్రిస్‌ అంగీకరించాడు.

తొలి నాలుగు వికెట్లు శ్రీనాథ్‌కూల్చిన తీరు చూస్తుంటే..ఆస్ట్రేలియా బౌలింగ్‌శైలి తలపించింది. భారత జట్టు అన్నివిధాలఇప్పుడు శక్తివంతంగా కన్పిస్తుందని ఈ ఆల్‌ రౌండర్‌పేర్కొన్నాడు. అయితే, సెమీస్‌ కు కివీస్‌ చేరుకుంటుందనిఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. ఫైనల్లోతిరిగి న్యూజిలాండ్‌, భారత్‌ తలపడవచ్చనేధీమా కూడా క్రెయిన్స్‌ లో వ్యక్తమైంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X