వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజధానిలో ఓ యువతి మౌనపోరాటం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హైదరాబాద్‌ కు చెందిన ఓ యవతి ఉషాకిరణ్‌ మూవీస్‌ రూపొందించిన మౌనపోరాటం చిత్రాన్ని ఆదర్శంగా తీసుకొన్నట్లు కన్పిస్తోంది. పదిహేనేళ్ళ క్రితం వచ్చిన మౌనపోరాటం అనే చిత్రంలో ఓ గిరిజన యువతి (యమున) తనను నమ్మించి మోసం చేసిన వ్యక్తిపై మౌనపోరాటం చేసి న్యాయాన్ని పొందుతుంది. అలాగే హైదరాబాద్‌ కు చెందినఅంబర్‌ పేట్‌ చెందిన దేవి అనే యువతి న్యాయం కోసం వీధి పోరాటం జరుపుతున్నారు.

అంబర్‌ పేట్‌ లోని జిందాతిలస్మాత్‌ నగర్‌ కు చెందిన 19 ఏళ్ళ దేవి రెండేళ్ళ క్రితం గౌతమి బాట్లింగ్‌ కంపెనీలో చేరింది. ఆ కంపెనీ యజమాని బిక్షపతి ఆమెపై అత్యాచరం జరిపాడు. అయితే,పెళ్ళి చేసుకుంటాను, ఎవరికీ చెప్పద్దని బిక్షపతిని దేవిని ప్రాధేయపడ్దాడు. దీంతో దేవి అతని మాటలు నమ్మి పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అలాగే దేవిని తన ఇంటిలోనే ఉంచుకొని తన ఇంటిపనులు చేయించుకోవడం మొదలుపెట్టాడు.

ఇదే సమయంలో దేవి బిక్షపతి వల్ల గర్భం దాల్చింది. ఆమెపెళ్ళి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా రకరకాల సాకులు చెప్పి తప్పించుకుంటూ వస్తున్నాడు. ఆమె మరీ పట్టుబట్టడంతో ఇంట్లోనే ఉన్న దేవుడు ఫోటోల సాక్షిగాపెళ్ళి చేసుకొని ఆమెతో కాపురం మొదలుపెట్టాడు. అయితే, నాలుగు నెలల క్రితం దేవి మగబిడ్డను ప్రసవించాక అతను ఆమెను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ...కేవలం ఇంట్లో పడుండేందుకు మాత్రమే తాళికట్టాను తప్ప బిడ్డను అంగీకరించేందుకు కాదని ఆమెను గెంటివేశాడు. ఆ తర్వాత బిక్షపతి పరారీలో ఉన్నాడు. ప్రస్తుతం బిక్షపతి కోసం దేవి పోలీసుస్టేషన్‌ ముందు పోరాటం చేస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X