వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వాసవీ డైరక్టర్లను విచారిస్తోన్న పోలీసులు
హైదరాబాద్: దివాళాతీసిన వాసవీకో-అపరేటివ్ బ్యాంకుకు చెందిన ఏడుగురు డైరక్టర్లను హైదరాబాద్ పోలీసులుఅరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు. చార్మినార్ బ్యాంకు తదితర బ్యాంకులవిషయంలో ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఈ బ్యాంకువిచారణను పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.
విచారణను వేగంగా ప్రారంభించిన పోలీసులు ప్రస్తుతం ఏడుగురు డైరక్టర్లను అదుపులోకి తీసుకొన్న వెంటనే గురువారం ఉదయం నుంచి క్రాస్ ఎగ్జామినంగ్ మొదలుపెట్టారని తెలుస్తోంది. ఈ కేసువిచారణ వివరాలను తెలియచేసేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. మీడియాను దూరంగా ఉంచాలని ఉన్నతాధికారులు పోలీసులకు ఆదేశాలు జారీచేశారు.
Comments
Story first published: Thursday, March 13, 2003, 23:53 [IST]