రైలులో బాంబు పేలి 11 మంది మృతి
ముంబాయి:
ముంబాయి
నగర
శివార్లలోని
ములుంద్రైల్వే
స్టేషన్లో
ఒక
లోకల్
రైలులో
జరిగిన
బాంబు
పేలుడులో
11
మంది
మరణించారు.
లోకల్రైలు
మొదటి
తరగతి
మహిళా
కంపార్ట్మెంట్లో
గురువారం
రాత్రి
8
గంటల
45
నిమిషాల
ప్రాంతంలో
ఈ
బాంబు
పేలుడు
సంభవించింది.
ఈ
దుర్ఘటనలో
70
మంది
దాకా
గాయపడ్డారు.
ఛత్రపతి శివాజీ టర్మినెస్ నుంచి 7 గంటల 56 నిమిషాలకు బయలుదేరిన ఈ రైలు ములుంద్ రైల్వే స్టేషన్లోని మూడవ నంబరు ప్లాట్ఫారంపైకి వస్తున్న సమయంలో ఈ ఘోరం జరిగింది. సంఘటనలో గాయపడిన వారిని సహ ప్రయాణికులు కంపార్ట్మెంట్లోంచి బయటకు లాగి ములుంద్, సియాన్ ఆస్పత్రిలో చేర్పించారు.
మరణించిన 11 మందిలో నలుగురు స్త్రీలు ఉన్నారు. ఇందులో ఇద్దరు పోలీసు కానిస్టేబుల్స్. వివిధ ఆస్పత్రుల నుంచి 28 మందిని డిస్చార్జి చేశారు. గత నాలుగు నెలల కాలంలో ఇది నాల్గవ పేలుడు సంఘటన. ఈ సంఘటనతో పోలీసులు నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రమాదం జరిగిన మార్గంలో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. మొహర్రం పర్వదినం కావడంతో రైళ్లలో ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉన్నదని అధికారులు చెప్పారు.
మరణించిన
వారి
పేర్లు
1.
రీమా
పాఠక్
2.
శోభా
షిండే
3.
విద్యా
కషిరానా
4.
స్వప్నిల్
రవీంద్ర
కాంబ్లి
5.
నన్వాని
నామ్దేవ్
6.
అశోక్
నామ్దేవ్
7.
శిరీష్
నుకుంద్
ఆగాషే
8.
ఆర్.వి.
సాల్వి
9.
జగదీష్
రామచంద్ర
భాటియా
10.
జగదీష్
ఘాయ్
11.
అశోక్
కుమార్
ధోమ్సే.