వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ ఏడాది విద్యుత్‌ ఛార్జీలు పెంచం

By Staff
|
Google Oneindia TeluguNews

కరీంనగర్‌: రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులను దృష్టిలోపెట్టుకొని ఈ ఏడాది విద్యుత్‌ ఛార్జీలు పెంచబోమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. వచ్చే ఏడాది కూడా ఛార్జీలు పెంచకూడదనే అనుకుంటున్నామని ఆయన శుక్రవారం కరీంనగర్‌ జిల్లా పర్యటనలోపేర్కొన్నారు.

జిల్లాల్లోని కరువు తీవ్రత, సహాయక చర్యలను ఆయన పరిశీలించారు. గంగాధర, రామడుగు మండలాల్లో విస్తృతంగా పర్యటించి కరువు తీవ్రతనుస్వయంగా వీక్షించారు. విద్యుత్‌ సబ్సిడీల రూపేణా ప్రభుత్వం ఎంతో భారాన్ని మోస్తోందని,అయినప్పటికీ కరువుతో ప్రజలు అల్లాడుతుంటేవిద్యుత్‌ ఛార్జీలు పెంచకూడదని నిర్ణయించినట్లు ఆయనప్రకటించారు.

ప్రస్తుతం ఏడాదికి రెండు వేల కోట్ల రూపాయలవిద్యుత్‌ సబ్సిడీని ప్రభుత్వం భరిస్తోందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో కరువు తీవ్రత దేశంలోనే అత్యధికంగా ఉందని, కేంద్రం మరిన్ని నిధులను వెంటనే విడుదల చేసి రాష్ట్ర రైతులను ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. రాజస్థాన్‌ తరహాలో అత్యంత ఎమర్జెన్సీ అవసరంగా రాష్ట్రానికి నిధులుఅందచేయాలని ఆయన కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X