వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ట్రిౖపుల్ ఐటి జాతికి అంకితం
హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలోని ప్రతిష్టాత్మకవిద్యాసంస్థ ఐఐఐటిని శనివారం రాష్ట్రపతి ఏపిజె అబ్దుల్ కలామ్ జాతికి అంకితం చేశారు. ఐటివిద్యావ్యాప్తి కోసం రాష్ట్రప్రభుత్వం ప్రారంభించిన ఈ అంతర్జాతీయవిశ్వవిద్యాలయం నాలుగేళ్ల అనంతరం జాతికి అంకితంఅయింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ..సాంకేతిక పరిజ్ఞానాన్నిసరియైన రీతిలో ఉపయోగించుకుంటే అద్భుతమైన ప్రగతిని సాధించవచ్చనిపేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఐటిపై చూపుతోన్న శ్రద్ధను ఆయన ప్రసంశించారు. అన్ని రాష్ట్రప్రభుత్వాలు ఈ-గవర్నెన్స్ దిశగా పయనించాలని ఆయన సూచించారు. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి సమాచారాన్ని ఇంటర్ నెట్ లో ఉంచితే, సమాచార హక్కు అనే కలసాకారమైనట్లేనని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ-గవర్నెన్స్విషయంలో తమ ప్రభుత్వం మంచి ఫలితాలను సాధిస్తోందన్నారు.
Story first published: Saturday, March 15, 2003, 23:53 [IST]