వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రిౖపుల్‌ ఐటి జాతికి అంకితం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్ర రాజధానిలోని ప్రతిష్టాత్మకవిద్యాసంస్థ ఐఐఐటిని శనివారం రాష్ట్రపతి ఏపిజె అబ్దుల్‌ కలామ్‌ జాతికి అంకితం చేశారు. ఐటివిద్యావ్యాప్తి కోసం రాష్ట్రప్రభుత్వం ప్రారంభించిన ఈ అంతర్జాతీయవిశ్వవిద్యాలయం నాలుగేళ్ల అనంతరం జాతికి అంకితంఅయింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ..సాంకేతిక పరిజ్ఞానాన్నిసరియైన రీతిలో ఉపయోగించుకుంటే అద్భుతమైన ప్రగతిని సాధించవచ్చనిపేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ఐటిపై చూపుతోన్న శ్రద్ధను ఆయన ప్రసంశించారు. అన్ని రాష్ట్రప్రభుత్వాలు ఈ-గవర్నెన్స్‌ దిశగా పయనించాలని ఆయన సూచించారు. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి సమాచారాన్ని ఇంటర్‌ నెట్‌ లో ఉంచితే, సమాచార హక్కు అనే కలసాకారమైనట్లేనని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ-గవర్నెన్స్‌విషయంలో తమ ప్రభుత్వం మంచి ఫలితాలను సాధిస్తోందన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X