పేదల విద్యుత్ కనెక్షన్లపై వాగ్యుద్ధం
హైదరాబాద్:
బలహీనవర్గాలకు
విద్యుత్
కనెక్షన్లపై
అధికార,
ప్రతిపక్ష
సభ్యుల
మధ్య
సోమవారం
శాసనసభలో
వాదప్రతివాదనలు
జరిగాయి.
మీటర్ల
కొనుగోలులో
అక్రమాలపై
ప్రతిపక్ష
సభ్యులు
ప్రభుత్వాన్ని
నిలదీశారు.
దళితవాడల విద్యుదీకరణలో ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోయిందని చెప్పిన ప్లానింగ్ కమీషన్ వ్యాఖ్యలను ప్రతిపక్షాలు ప్రశ్నోత్తరాల సమయంలో ఉటంకిస్తూ పేద, బలహీనవర్గాల ప్రజల ఇళ్లకు కరెంట్ కనెక్షన్లు ఇచ్చే విషయంలో ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందని ప్రతిపక్ష సభ్యులు విమర్శించారు. కరువు పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో డిస్కనెక్ట్ చేసిన కరెంట్ సరఫరాను పునరుద్ధరించాలని ప్రతిపక్ష నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. డిమాండ్ మేరకు కనెక్షన్లు ఇస్తున్నామని, దళితవాడల్లో వీధిదీపాలను ఎక్కడ తొలగించలేదని విద్యుచ్ఛక్తి శాఖ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు చెప్పారు.
మీటర్ల కొనుగోలులో అక్రమాలు జరిగాయనే ఆరోపణను ఆయన ఖండించారు. ప్రభుత్వం ప్రమణాలు పాటించని ఢిల్లీకి చెందిన క్యాపిటల్ కంపెనీ నుంచి 98 వేల మీటర్ల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చిందని, ఇప్పటికే 35 వేల మీటర్లు కొనుగోలు చేశారని, ఈ కొనుగోలులో అక్రమాలు చోటు చేసుకున్నాయని డి. నాగేందర్ (కాంగ్రెస్) అంతకు ముందు అన్నారు. ఈ విషయమై తాను వారం రోజుల క్రితమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.