మతవిద్వేషాలను సహంచం: బాబు
హైదరాబాద్: విశ్వహిందూ పరిషత్ నేత ప్రవీణ్ తొగాడియా సోమవారం తనపై చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో కరువుతో ప్రజలు అల్లాడుతుంటే, పని లేని తొగాడియా లాంటి వ్యక్తులు మత విద్వేషాలను రొచ్చగొట్టేలా ప్రవర్తిస్తుండడం సిగ్గుచేటని ముఖ్యమంత్రి ఘాటుగా విమర్శించారు. తొగాడియా విమర్శలను తాను పెద్దగా పట్టించుకోనని ఆయన మంగళవారం తనని కలిసిన విలేకరులతో అన్నారు.
రాష్ట్రంలో మత విద్వేషాలను రొచ్చగొట్టే వారి ఎవరినీ ప్రోత్సహించమని ఆయన స్పష్టం చేశారు. బీజేపీతో మైత్రికి, వీఎచ్ పి, భజరంగ్ దళ్ నేతల వైఖరికి సంబంధం లేదని ముఖ్యమంత్రి తెలిపారు. బీజేపీ ప్రభుత్వంతో కేంద్రంలో సంబంధం కొనసాగుతుందని అలాగే మతవిద్వేషాలను రెచ్చగొట్టే వారు ఎవరినైనా ప్రోత్సహించమని ఆయన అన్నారు. అనంతపురంలో ప్రభుత్వం తన భాద్యతను నిర్వర్తించిందని, ఇందులో వ్యక్తిగత ప్రతీకార చర్యలు ఏమీ లేవని ఆయన స్పష్టం చేశారు.