రాష్ట్రప్రయోజనాల పట్టింపు: కడియం
హైదరాబాద్: నదుల అనుసంధానం విషయంలో ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించకపోతే రాష్ట్రానికి పెద్దగా నష్టం వాటిల్లుతుందని కాంగ్రెస్ పార్టీ హెచ్చరించింది. గంగా-కావేరి నదుల అనుసంధాన జాతీయ ప్రాజెక్ట్ వల్ల మన రాష్ట్రానికి కన్నా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకే ప్రయోజనం ఎక్కువన్న విషయాన్ని రాష్ట్రప్రభుత్వం గుర్తించాలని కాంగ్రెస్ సభ్యుడు ఎం.వి.మైసూరారెడ్డి ప్రభుత్వానికి సూచించారు.
మంగళవారంనాడు అసెంబ్లీలో 304 నిబంధన కింద జరిగిన చర్చ సందర్భంగా మైసూరా ప్రభుత్వానికి సూచించారు. దీనిపై రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖమంత్రి కడియం శ్రీహరి స్పందిస్తూ...రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టే ఏ పని ప్రభుత్వం చేపట్టబోదని సభకు హామీ ఇచ్చారు. జాతీయ జలవనరుల అభివృద్ది సంఘం ప్రతిపాదనలను యథాతథంగా ఆమోదించబోమన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూత్రప్రాయంగా నదీజలాల అనుసంధానానికి మద్దతిస్తున్నామని ప్రకటించారు. అంతమాత్రాన రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఊరుకుంటామని కాదని కాంగ్రెస్ సభ్యుల సందేహాన్ని తీర్చారు.