సద్దాంహుస్సేన్ కు 48 గంటలు
వాషింగ్టన్: దేశం విడిచి వెళ్ళేందుకు ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ కు అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ 48 గంటల గడవు విధించారు. 48 గంటల్లో సద్దాం, ఆయన ఇద్దరు కుమారులు కుసయ్, ఉదయ్ లు దేశం విడిచి వెళ్ళకపోతే సైనికచర్య తప్పదని బుష్ తన ప్రత్యేక ప్రసంగంలో హెచ్చరించారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 6.30 గంటలకు బుష్ అమెరికా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
ఇరాక్ మానవాళిని అంతంచేసే భయంకరమైన ఆయుధాలను కలిగిఉంది. ఇందుకు సంబంధించి ఆధారాలున్నాయి. ఇరాక్ వీటిని తన పక్కదేశాలపైనే కాకుండా సొంత ప్రజలపై అనేకసార్లు ఉపయోగించింది. సద్దాంకు టైం దగ్గర పడిందంటూ జార్జిబుష్ తన ప్రసంగంలో హుంకరించారు. అయితే, బుష్ హెచ్చరికను ఇరాక్ విదేశాంగ మంత్రి తోసిపుచ్చారు.
సద్దాంకు బదులు బుష్ గద్దె దిగి, అమెరికా వదిలి వెళితే బాగుంటుందని జవాబు ఇచ్చారు. ఇరాక్ వల్ల ప్రమాదం స్పష్టంగా కనబడుతోందని బుష్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
జీవ,రసాయనాయుధాలు కలిగి ఉన్న ఇరాకీ మిలిటరీ ప్రభుత్వం సహాయంతో టెర్రరిస్ట్ లు ప్రజలను హతం చేసే అవకాశం ఉంది. సద్దాం వెళితే..తీవ్రవాదం అంతమైనట్లేనని బుష్ అన్నారు. సద్దాం నిరాయుధీకరణకు కట్టుబడి ఉంచేలా చేయడంలో ఐక్యరాజ్యసమితి బుష్ ఆరోపించారు.