వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతుపై వడగళ్ల దెబ్బ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: నూతిలో పడ్డవాడిపై తాటిపండు పడినట్లు రాష్ట్ర ప్రజల పాలిట వడగళ్ల వాన తాజా శాపమైంది. ఇప్పటికే రాష్ట్ర ప్రజలు కరువు కోరల్లో చిక్కుకుని సతమతమవుతున్నారు. గత రెండు రోజులుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణితో రాష్ట్రంలో వడగళ్ల వానలు, అకాల వర్షాలు కురిశాయి. దీంతో పంటలు నష్టపోయి రైతులు విలవిలలాడుతున్నారు.

అల్పపీడన ద్రోణి ప్రభావం ఇంకా వీడలేదు. కృష్ణాజిల్లాలో అత్యధికంగా మంగళవారం 11 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదయింది. నల్లగొండ, వరంగల్‌, గంటూరు జిల్లాలో వడగళ్లవానలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. నల్లగొండ జిల్లా రాజాపేట మండలంలోని సింగారం గ్రామంలో వడగళ్ల వాన కురిసి 500 ఎకరాల్లో పంట నష్టమైనట్లు ఒక అంచనా. కనీసం 40 మంది గాయపడ్డారు. పలువురు ఇళ్లు కోల్పోయారు. మామిడితోటలు ధ్వంసమయ్యాయి. ఈ గ్రామంలో జిల్లా మంత్రి ఉమామాధవరెడ్డి, పార్లమెంట్‌ సభ్యుడు సుఖేందర్‌ రెడ్డి పర్యటించారు. ఇళ్లు కోల్పోయినవారికి తగిన సహాయం చేస్తామని వారు హామీ ఇచ్చారు.

వరంగల్‌ జిల్లా బచ్చన్నపేట మండలం మన్సాన్‌పల్లి, సోలాపూర్‌లలో మంచుపెల్లలు రాలిపడ్డాయి. ఐదు కిలోల బరువున్న ఈ మంచపెల్లలు రాలిపడడంతో వంద మంది దాకా గాయపడ్డారు. వరిపంట నాశనమైంది. గుంటూరు జిల్లాలో మిర్చిపంటలు పూర్తిగా నాశనమయ్యాయి. ఒక గ్రామంలోనే కోటి రూపాయల దాకా మిర్చి పంట నష్టపోయినట్లు సమాచారం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X