వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రంగుల్లో మునిగి తేలిన మంత్రి
హైదరాబాద్:
రాష్ట్రంలో
హోలీ
పర్వదినాన్ని
ప్రజలు
ఆనందోత్సాహాల
మధ్య
జరుపుకున్నారు.
ఆబాలగోపాలం
రంగుల్లో
మునిగి
తేలారు.
హైదరాబాద్లోని బస్తీలన్నీ రంగుల్లో తేలియాడాయి. పెద్దలు, పిల్లలు అందరూ పరస్పరం రంగులు చల్లుకుంటూ హోలీని ఆనందంగా జరుపుకున్నారు. భారతీయ జనతా పార్టీ (బిజెపి) కార్యాలయంలో పండగ వాతావరణం నెలకొంది. కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు హోలీ రంగులు చల్లుకున్నారు. రైల్వే శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ రంగుల్లో మునిగి తేలారు. బిజెపి కార్యకర్తలు ఆయనను రంగుల్లో ముంచేశారు.
Comments
Story first published: Wednesday, March 19, 2003, 23:53 [IST]