డిసిసిబి అక్రమాలపై విచారణ
హైదరాబాద్:
కర్నూలు
జిల్లా
కేంద్ర
సహకార
బ్యాంక్
(డిసిసిబి)లో
అక్రమాల
ఆరోపణలపై
అవసరమైతే
మరోసారి
విచారణ
జరిపిస్తామని
సహకార
మంత్రి
చిక్కాల
రామచంద్రారావు
చెప్పారు.
గురువారం
శాసనసభలో
ప్రతిపక్ష
సభ్యులు
చేసిన
ప్రస్తావనకు
ప్రతిస్పందిస్తూ
ఆయన
ఈ
విషయం
చెప్పారు.
కర్నూలు డిసిసిబిలో రెండు కోట్ల రూపాయల మేర కుంభకోణం జరిగిందని, రాష్ట్రంలోని డిసిసిబిలన్నింటా ఇదే పరిస్థితి ఉన్నదని కాంగ్రెస్ విమర్శించింది. ఈ విషయమై ఇది వరకే విచారణ జరిపించామని, అయితే అవసరమైతే మళ్లీ విచారణ జరిపిస్తామని మంత్రి చెప్పారు.
ఆ చర్చ రాష్ట్ర కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ జనార్దన్ రావుపైకి మళ్లింది. జనార్దన్ రావుపై అనేక ఆరోపణలు వచ్చాయని, అయినప్పటికీ ప్రభుత్వం ఆయన పదవీ కాలాన్ని పొడిగించిందని, అలా పొడిగించడం సరైంది కాదని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు.