వాయిదా తీర్మానాలపై వాగ్యుద్ధం
హైదరాబాద్:
వాయిదా
తీర్మానాలపై
గురువారం
శాసనసభలో
అధికార,
ప్రతిపక్ష
సభ్యుల
మధ్య
వాగ్వివాదం
చెలరేగింది.
కాంగ్రెస్,
సిపిఎంలు
ఇచ్చిన
వాయిదా
తీర్మానాలను
స్పీకర్
కె.
ప్రతిభా
భారతి
త్రోసిపుచ్చడంతో
ఈ
వాగ్వివాదం
ప్రారంభమైంది.
కాంగ్రెస్
నల్లబెల్లం
రైతుల
సమస్యపై,
సిపిఎం
బిజినెస్
స్కూల్,
ఐఐఐటిలో
ఎస్సి,
ఎస్టి
రిజర్వేషన్లు
అమలు
కాకపోవడంపై
వాయిదా
తీర్మానాలను
ప్రతిపాదించాయి.
వీటిపై
చర్చకు
ఆ
పార్టీలు
పట్టుబట్టారు.
అయితే
ఈ
తీర్మానాలను
స్పీకర్
తిరస్కరించారు.
వాయిదా తీర్మానాల పేరుతో ప్రతిపక్షాలు సభా సమయం వృధా చేస్తున్నాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పూసపాటి అశోకగజపతి రాజు విమర్శించారు. ఆయన నియమ నిబంధనలను ఉటంకిస్తూ సుదీర్ఘంగా మాట్లాడారు. నియమ నిబంధనలు తమకు కూడా తెలుసునని, తమకు కూడా అంతో కొంతో ఇంగ్లీష్ వచ్చునని ప్రతిపక్ష నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి వ్యాఖ్యానిస్తూ నియమ నిబంధనలు ఉటంకిస్తూ అశోకగజపతి రాజు సభా సమయం వృధా చేస్తున్నారని అన్నారు.
అయితే తాము రైతుల సమస్య ప్రభుత్వాన్ని ఒక ప్రకటన చేయాలని మాత్రమే అడుతున్నామని, రైతుల సమస్యలు పట్టని అధికార పక్షం సభా సమయం వృధా చేయడానికి పూనుకున్నదని ఆయన అన్నారు. తాము ప్రజా సమస్యలను ప్రస్తావిస్తున్నామని, ప్రజలకు సంబంధించిన సమస్యలను ప్రస్తావించకూడదని చెప్పడం సరైంది కాదని నోముల నరసింహయ్య (సిపిఎం) అన్నారు.