అమెరికాది నిస్సిగ్గు చర్య: సద్దాం
బగ్దాద్/ఐక్యరాజ్యసమితి:
శత్రువుపై
పోరాడి
ప్రియమైన
దేశాన్ని
కాపాడుకోవాలని
ఇరాక్
అధ్యక్షుడు
సద్దాం
హుస్సేన్
దేశ
ప్రజలను
కోరారు.
ఆయన
గురువారం
ఉదయం
టెలివిజన్లో
దేశ
ప్రజలను
ఉద్దేశించి
ప్రసంగించారు.
ఆయన
సైనిక
దుస్తుల్లో
టెలివిజన్లో
దర్శనమిచ్చారు.
శత్రువులు
తమ
పట్ల
అన్యాయంగా
ప్రవర్తిస్తున్నారని,
ఆయుధాలు
చేపట్టి
అమెరికా
బలగాలను
తిప్పికొట్టాలని
ఆయన
ప్రజలను
ఉద్దేశించి
అన్నారు.
ఈ
యుద్ధంలో
ఇరాక్
గెలిచి
తీరుతుందని
ఆయన
ధీమా
వ్యక్తం
చేశారు.
దుష్టశక్తి
ఓడిపోక
తప్పదని
ఆయన
అన్నారు.
అమెరికా
నిస్సిగ్గుగా
వ్యవహరిస్తోందని,
తాము
శాంతిని
ప్రేమిస్తామని,
శాంతిస్థాపన
దిశగా
సాగుతామని
ఆయన
అన్నారు.
అమెరికాపై
సద్దాం
తీవ్ర
స్థాయిలో
విరుచుకపడ్డారు.
అమెరికా అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘిస్తోందని ఐక్యరాజ్యసమితిలో ఇరాక్ దౌత్యవేత్త మొహ్మద్ ఆల్- దౌరి విమర్శించారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితికి, భద్రతా మండలికి నివేదిస్తామని ఆయన అన్నారు. అమెరికా దాడి ఐక్యరాజ్యసమితి చార్టర్కు వ్యతిరేకమని, అంతర్జాతీయ చట్ట ఉల్లంఘన అని ఆయన అన్నారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ సమాజానికి తెలియజేస్తామని ఆయన అన్నారు.