వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఫ్లోరసిస్పై ధ్వజమెత్తిన కోమటిరెడ్డి
హైదరాబాద్:
నల్లగొండ
జిల్లాలోని
ఫ్లోరోసిస్
బాధితులపై
రాష్ట్ర
ప్రభుత్వానికి
సానుభూతి
లేదని
నల్లగొండ
కాంగ్రెస్
శాసనసభ్యుడు
కోమటి
రెడ్డి
వెంకటరెడ్డి
విమర్శించారు.
ఆయన
శుక్రవారం
శాసనసభలో
ఈ
విమర్శ
చేశారు.
ఫ్లోరోసిస్ పీడిత ప్రాంతాలకు రక్షిత మంచినీటిని సరఫరా చేయాలని, జి.వో. నెంబరు 70ని రద్దు చేయాలని ఆయన ఇటీవల నల్లగొండలో ఆమరణ నిరాహార దీక్ష చేసిన విషయం తెలిసిందే. తాను దీక్షలో ఉన్నప్పుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రి డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన అన్నారు. ఫ్లోరోసిస్ సమస్యకు పరిష్కారం చూపడానికి ప్రయత్నిస్తున్నది తెలుగుదేశం ప్రభుత్వమేనని కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శలకు ప్రతిస్పందిస్తూ మంత్రి జనార్దన్ రెడ్డి అన్నారు. సంబంధిత ప్రాజెక్టుకు 30 కోట్ల రూపాయలు విడుదల చేశామని, పనులు ప్రారంభించామని ఆయన చెప్పారు.
Comments
Story first published: Friday, March 21, 2003, 23:53 [IST]