వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దొంగల బీభత్సం- ఇద్దరి హత్య

By Staff
|
Google Oneindia TeluguNews

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లాలోని ఒక అయ్యప్ప స్వామి దేవాలయంలో దొంగలు బీభత్సం సృష్టించి ఇద్దరిని హత్య చేశారు. ఈ సంఘటన శుక్రవారం అర్ధరాత్రి జరిగింది.

ఆదిలాబాద్‌ జిల్లా చాందటి గ్రామంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో దోపిడికి పాల్పడడానికి దొంగలు ప్రయత్నించారు. అయ్యప్పస్వామి ఆభరణాలను, ఇతర నగలను దోచుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా దొంగలను దేవాలయం గార్డు నారాయణ, అక్కడే నిద్రిస్తున్న సత్యనారాయణ అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో దొంగలు వారిద్దరిని హత్య చేశారు. హత్యానంతరం దోపిడీ దొంగలు సొత్తును ఎత్తుకెళ్లారు. శిల్పి సత్యనారాయణ కరీంనగర్‌ జిల్లా కోరుట్లకు చెందినవాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X