యుద్దం బూచి, పెట్రోదోపిడీ
హైదరాబాద్: ప్రజలను బహిరంగంగా నిలువుగా దోపిడి చేయడంలో పెట్రోలు బంకులు ముందంజలో ఉంటాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో యుద్దం పేరు చెప్పి పెట్రోలు బంకులు యజమాన్యాలు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. ముఖ్యంగా చిన్న, చిన్న పట్టణాల్లో పెట్రోల్ బంకు యజమాన్యాలు ఇలాంటి దోపీడీలకు పాల్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇరాక్ లో బాంబులు వేస్తున్నారు. ఇక్కడికి పెట్రోలు సరాఫరా ఆగిపోయింది. అందుకే స్టాక్ లేదని పెద్ద పెద్ద అక్షరాలతో తిరుపతి, నెల్లూరు వంటి ప్రాంతాల్లో బహిరంగంగా బోర్డులు పెట్టారు.
కాస్తా చదువుకున్నవారు నిలదీస్తున్నా..బంకు యజమాన్యాలు మొండిగా స్టాక్ లేదని చెప్పుతున్నారు. హైదరాబాద్ శివార్లల ప్రాంతాల్లోని ఓ బంకు యజమాని స్టాక్ లేదని బోర్డు పెట్టాడని సమాచారం అందడంతో అధికారులు వెంటనే శుక్రవారం ఆ బంకుపై రెయిడ్ చేశారు. అయితే, నిజంగానే ఆ బంకులో కోటా అయిపోయిందని తెలిసింది.
చిన్న, చిన్న పట్టణాల్లో మాత్రం అధికారులతో లాలూచీ పడి బంకు యజమాన్యాలు కృత్రిమ కొరతను సృష్టిస్తోన్నట్లు తెలుస్తోంది. కేంద్రప్రభుత్వం అర్ధరాత్రి నుంచి పెట్రోలు ధరలు పెంచినట్లు ప్రకటిస్తే మధ్యాహ్ననికే రేట్ పెంచే బంకు యజమాన్యాలు దర్జాగా దోపిడి చేస్తుంటారు.