అంతా క్రికెట్ మయం
న్యూఢిల్లీ:
దేశంలో
సర్వం
క్రికెట్
మయం
అయిపోయింది.
అందరి
దృష్టి
ఆదివారం
జోహెన్స్బర్గ్లో
జరిగే
ప్రపంచ
కప్
ఫైనల్
పోటీ
పైనే
ఉంది.
ఓటమెరుగని
ఆస్ట్రేలియాతో
భారత్
తలపడబోతోంది.
ప్రపంచ
కప్
తొలి
మ్యాచ్లో
తడబడి
విమర్శల
పాలైన
భారత
జట్టు
అనూహ్యంగా
పుంజుకుని
వరుస
విజయాలను
అందుకుంటూ
ఫైనల్కు
చేరింది.
ఆస్ట్రేలియాపై
భారత్
గెల్చే
అవకాశం
ఉందని
పలువురు
వ్యాఖ్యానిస్తున్నారు.
తమ
జట్టు
ప్రపంచ
కప్తో
దేశానికి
తిరిగి
వస్తుందని
భారతీయులు
గట్టిగా
నమ్ముతున్నారు.
భారత్ విజయాన్ని కాంక్షిస్తూ దేశంలో పూజలు కూడా జరుగుతున్నాయి. ముంబాయిలో శనివారం ఒక దేవాలయంలో పూజలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమాల్లో పిల్లలు కూడా పాల్గొన్నారు. కోలకత్తా నగరమంతా త్రివర్ణ పతాకాలతో నిండిపోయింది. భారత విజయాన్ని కాంక్షిస్తూ నగరంలో వీధివీధినా త్రివర్ణ పతాకాలు ఎగురవేశారు. నగరంలో త్రివర్ణ పతాకాలు విపరీతంగా గిరాకీ పెరిగింది. రోజుకు 30 వేల నుంచి 40 వేల త్రివర్ణ పతాకాల వ్యాపారం జరుగుతున్నట్లు ఒక అంచనా. రోజుకు పదివేల జెండాలు అమ్ముడైనట్లు సమాచారం. భారత క్రికెట్ జట్టు విజయాన్ని కాంక్షిస్తూ ముస్లింలు శనివారం ప్రదర్శన నిర్వహించారు. భారత్ విజయం సాధించాలని నినాదాలు చేశారు. దేశమంతటా ప్రదర్శనలు జరిగాయి.
రెండు దశాబ్దాల తర్వాత భారత్ ప్రపంచ కప్ ఫైనల్లో ప్రవేశించడం, విజయావకాశాలు ఉండడం భారతీయులను ఉత్సాహంలో నింపుతోంది. ఈ రీత్యా భారత ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి ఉంది. ప్రధాని వాజ్పేయి నుంచి ప్రతిపక్ష నేత సోనియా గాంధీ వరకు ఆదివారంనాటి ఫైనల్పై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. అందరు భారతీయుల్లాగే తానూ ఫైనల్ మ్యాచ్ చూస్తానని ఆమె అన్నారు.