బాబు ఆఫీసు వద్ద ధర్నా యత్నం- ఘర్షణ
హైదరాబాద్:
శాసనసభ
నుంచి
సస్పెండ్
అయిన
కాంగ్రెస్
సభ్యులు
ఆ
తర్వాత
ముఖ్యమంత్రి
నారా
చంద్రబాబునాయుడు
కార్యాలయం
వద్ద
ధర్నా
చేయడానికి
ప్రయత్నించారు.
వారిని
భద్రతా
బలగాలు
అడ్డగించే
ప్రయత్నం
చేయడంతో
ఘర్షణ
వాతావరణం
నెలకొంది.
కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పి) నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని పార్టీ శాసనసభ్యులు శాసనసభ ఆవరణలోని ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద ధర్నా చేయడానికి ప్రయత్నించారు. వారిని భద్రతా బలగాలు అడ్డగించడానికి ప్రయత్నించడంతో తోపులాట జరిగింది. ఈ సంఘటనలో ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద అద్దాలు పగిలాయి. ఆ తర్వాత కాంగ్రెస్ సభ్యులు లాబీలో బైఠాయింపు జరిపారు. ఈ సంఘటనను రికార్డు చేయడానికి ప్రయత్నించిన మీడియా ప్రతినిధులను భద్రతా బలగాలు తోసేశాయి. చేయి కూడా చేసుకున్నాయి.
చంద్రబాబునాయుడు ప్రభుత్వం ప్రతిపక్షాల, మీడియా నోళ్లు నొక్కే ప్రయత్నం చేస్తోందని రాజశేఖర్ రెడ్డి విమర్శించారు. న్యాయం జరగాలని డిమాండ్ చేస్తే తమను బయటకు పంపారని సిపిఎం సభ్యుడు నోముల నరసింహయ్య విమర్శించారు. ప్రజలే చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని ఆయన అన్నారు.