వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌, సిపిఎం సభ్యుల గెంటివేత

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలపై శనివారం శాసనసభలో, శాసనసభ వెలుపలా తీవ్ర గందరగోళం చెలరేగింది. పరిస్థితి ఉద్రిక్తతకు, ఆవేశకావేశాలకు కారణమైంది. ఆత్మహ్యత చేసుకున్న రైతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించే విషయమై ప్రభుత్వం ప్రకటన చేయాలని పట్టుబట్టుబడుతూ శాసనభా కార్యక్రమాలను అడ్డుకున్న కాంగ్రెస్‌, సిపిఎం శాసనసభ్యులను సభ నుంచి సస్పెండ్‌ చేశారు. మార్షల్స్‌ చేత వారిని బయటకు గెంటివేశారు.

రైతుల ఆత్మహత్యల ఉదంతాలను కాంగ్రెస్‌ శాసనసభ్యుడు వేణుగోపాల్‌ రెడ్డి జీరో అవర్‌లో ప్రస్తావించారు. ఆత్మహత్య చేసుకన్న రైతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రుణాలు చెల్లించకలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, లక్ష రూపాయల నష్టపరిహారానికి ఆశపడి వారు చనిపోవడం లేదని ఆయన అన్నారు. తను ప్రస్తావించిన అంశానికి వెంటనే ప్రభుత్వం ప్రతిస్పందించాలని ఆయన పట్టుబట్టారు. ప్రభుత్వం నుంచి జవాబు ఇవ్వాలని కాంగ్రెస్‌ సభ్యులందరూ పట్టుబట్టారు. జీరో అవర్‌లో ప్రస్తావించే అంశాలకు జవాబు ఇచ్చే సంప్రదాయం లేదని, అందువల్ల ఈ విషయంపై జవాబు ఇవ్వబోమని ప్రభుత్వం చెప్పింది. దీంతో ఆగ్రహించిన కాంగ్రెస్‌ సభ్యులు లేచి నిలబడి నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలు అడ్డుకున్నారు.

దీంతో కాంగ్రెస్‌, సిపిఎం సభ్యుల సస్పెన్షన్స్‌కు రెవెన్యూశాఖ మంత్రి పూసపాటి అశోక గజపతి రాజు తీర్మానం ప్రతిపాదించారు. దీంతో స్పీకర్‌ వారిని ఒక రోజు పాటు సస్పెండ్‌ చేశారు. అయినప్పటికీ కాంగ్రెస్‌, సిపిఎం సభ్యులు బయటకు వెళ్లిపోలేదు. దీంతో వారిని మార్షల్స్‌ చేత బయటకు పంపించివేశారు. ఈ చర్యకు నిరసనగా మజ్లీస్‌ శాసనసభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X