క్రికెట్: ఆస్ట్రేలియా భారీ స్కోర్
జోహెన్స్బర్గ్:
క్రికెట్
ప్రపంచ
కప్
ఫైనల్లో
ఆస్ట్రేలియా
భారత్
ముందు
భారీ
లక్ష్యాన్ని
ఉంచింది.
ఆస్ట్రేలియా
నిర్దేశించిన
360
భారీ
లక్ష్యాన్ని
ఛేదించడానికి
మైదానంలోకి
దిగిన
భారత్
ఆదిలోనే
సచిన్
టెండూల్కర్
వికెట్ను
కోల్పోయి
కష్టాల్లో
పడింది.
ఆస్ట్రేలియా
పటిష్టమైన
బ్యాటింగ్
ముందు
భారత
బౌలింగ్
ఈ
మాత్రం
ప్రభావం
చూపలేకపోయింది.
గిల్క్రిస్ట్,
మాథ్యూ
హెడన్
అందించిన
గొప్ప
ప్రారంభాన్ని
ఆ
తర్వాత
పోంటింగ్,
మార్టిన్
కొనసాగించారు.
దీంతో
ఆస్ట్రేలియా
రెండు
వికెట్లు
మాత్రమే
కోల్పోయి
359
పరుగులు
చేసింది.
ఇది
ప్రపంచ
కప్లోనే
కాకుండా
వన్డేల్లోనే
అత్యధిక
స్కోరు.
ఆస్ట్రేలియా 17 ఓవర్లు బౌలింగ్ చేసిన తర్వాత వర్షంతో ఆట ఆగిపోయింది. భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి మైదానంలోకి దిగిన భారత్ 17 ఓవర్లలో 103 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం జోరందుకుంది. దీంతో ఆట ఆగిపోయింది. ఆ తర్వాత కొద్దిసేపటి తిరిగి ఆట ప్రారంభమైంది.
ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పోంటింగ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి 121 బంతుల్లో 140 పరుగుల అజేయ సెంచరీ చేశాడు. ఫోర్లు, సిక్సర్లతో మైదానం నలువైపులా బంతులను బౌండరీలు దాటిస్తూ పోయాడు. మార్టిన్ తన కెప్టెన్తో పోటీ పడ్డాడు. మార్టిన్ 88 పరుగులతో నాటవుట్గా మిగిలాడు. అంతకు ముందు గిల్క్రిస్ట్, హెడెన్ కలిసి వేగంగా పరుగులు సాధించి మంచి ఆరంభాన్ని అందించారు. గిల్క్రిస్ 57 పరుగులు చేసి హర్బజన్ సింగ్ బౌలింగ్లో అవుటయ్యాడు. హర్బజన్ రెండు వికెట్లు తీశాడు.
భారత ఫాస్ట్ బౌలర్లు వికెట్లు తీయడంలో విఫలం కావడమే కాకుండా పెద్ద యెత్తున పరుగులు ఇచ్చారు. అంతేకాకుండా విరివిగా ఎక్స్ట్రాలు ఇచ్చారు. నాలుగు ఓవర్లు అధికంగా వేయాల్సి వచ్చింది.