ఆంధ్రలో క్రికెట్ ప్రేమికుల ప్రదర్శనలు
హైదరాబాద్:
క్రికెట్
ప్రపంచ
కప్
ఫైనల్లో
భారత
విజయాన్ని
కాంక్షిస్తూ
రాష్ట్రంలోని
పలు
చోట్ల
ఆదివారం
ఉదయం
ప్రదర్శనలు,
తదితర
కార్యక్రమాలు
జరిగాయి.
రెండు
దశాబ్దాల
తర్వాత
ఫైనల్కు
చేరుకున్న
భారత్
ప్రపంచ
కప్
తీసుకురాగలదని
రాష్ట్ర
ప్రజలు
ఆశిస్తున్నారు.
హైదరాబాద్లో ప్రదర్శనలు, ర్యాలీలు జరిగాయి. నెక్లెస్ రోడ్డులో భారీ ప్రదర్శన జరిగింది. ముఖాలకు జెండా రంగులు అద్దుకుని అభిమానులు ర్యాలీలో పాల్గొన్నారు. సినీతారలు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. టీ షర్ట్ల అమ్మకాలకు ప్రత్యేక కౌంటర్లు తెరిచారు. జి.ఎం.సి. బాలయోగి స్టేడియంలో వేడుక వాతావరణం చోటు చేసుకుంది. స్టేడియంలో భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు.
సౌరబ్ సేన విజయాన్ని కాంక్షిస్తూ విశాఖపట్నంలో పూజలు చేశారు. దేవుళ్లు క్షీరాభిషేకాలు చేశారు. శ్రీకాకుళంలో డప్పు వాయిద్యాలతో ర్యాలీ నిర్వహించారు. విజయవాడలో త్రివర్ణ పతాకాలు రెపరెపలాడాయి. తిరుపతిలో కూడా ర్యాలీలు జరిగాయి. మ్యాచ్ ప్రారంభం కాగానే అభిమానులు టీవీలకు అతుక్కుపోయారు. హైదరాబాద్ రోడ్లన్నీ నిర్మానుష్యమయ్యాయి.