ఆత్మహత్యలపై కాంగ్రెస్ ఆందోళన
హైదరాబాద్ః
ఆత్మహత్యలు
చేసుకున్న
రైతులకు
ఎక్స్
గ్రేషియా
చెల్లించాలని
కాంగ్రెస్,
ఇతర
ప్రతిపక్షాలు
సోమవారం
అసెంబ్లీలో
డిమాండ్
చేశాయి.
దీనిపై
చర్చకు
ఈ
పార్టీలు
ఇచ్చిన
వాయిదా
తీర్మానాన్ని
స్పీకరు
ప్రతిభా
భారతి
తిరస్కరించడంతో
కాంగ్రెస్
సభ్యులు
పెద్ద
ఎత్తున
ఆందోళనకు
దిగారు.
ఈ దశలో అధికార పక్ష సభ్యులు శనివారం నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోని ముఖ్యమంత్రి కార్యాలయాన్ని దిగ్బంధం చేసిన విషయాన్ని ప్రస్తావించి కాంగ్రెస్ సభ్యులు క్షమాపణ చెప్పాలని కోరారు. ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, పరిశ్రమల మంత్రి కోటగిరి విద్యాధర రావు కాంగ్రెస్ సభ్యుల ప్రవర్తనపై తీవ్రంగా ధ్వజమెత్తారు.
అంతకు ముందు ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్ధితులను, రైతుల ఆత్మహత్యలను ప్రస్తావించారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై చర్చకు అనుమతించాలనిఆయన కోరగా స్పీకరు నిరాకరించారు. దీనితో మొత్తం మూడు గంటలసేపు సభా కార్యక్రమాలు స్తభించిపోయాయి.