వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరద కాలువ కోసం రాస్తారోకో

By Staff
|
Google Oneindia TeluguNews

కరీంనగర్‌: శ్రీరాంసాగర్‌ వరద కాలువ ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌, సిపిఎంలు కరీంనగర్‌ను దిగ్బంధం చేశారు. కరీంనగర్‌లోకి ప్రవేశించే ఐదు రహదారుల వద్ద బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దాదాపు ఐదు గంటల పాటు ట్రాఫిక్‌ స్తంభించిపోయింది.

వరద కాలువ పనులను చేపట్టడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని కాంగ్రెస్‌, సిపిఎంలు విమర్శించాయి. రాస్తారోకోను నిరోధించడానికి పోలీసులు ప్రయత్నం చేశారు. అయితే ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చే వరకు తాము రాస్తారోకోను ఆపబోమని సిపిఎం, కాంగ్రెస్‌ నాయకులు చెప్పారు. దీంతో జాయింట్‌ కలెక్టర్‌ దిగి వచ్చి- ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనకారులు రాస్తారోకోను విరమించారు.

ఏడాదికి ఐదు కోట్ల రూపాయల చొప్పున కేటాయించి శ్రీరాంసాగర్‌ వరద కాలువను పూర్తి చేయాలని కాంగ్రెస్‌ మాజీ శాసనసభ్యుడు కేతిరి సాయిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వరద కాలువను పూర్తి చేయడానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని సిపిఐ నాయకుడు వెంకటరెడ్డి డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌, నల్లగొండ, వరంగల్‌ జిల్లాలోని భూములకు సాగు నీరందించడానికి శ్రీరాంసాగర్‌ వరద కాలువను చేపట్టారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X