వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీవీలో కనిపించిన సద్దాం

By Staff
|
Google Oneindia TeluguNews

బగ్దాద్‌: ఇరాక్‌ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌ ప్రభుత్వ దూరదర్శన్‌లో దర్శనమిచ్చారు. ఆయన టీవీలో జాతినుద్దేశించి ప్రసంగించారు. అమెరికా దాడుల్లో గాయపడినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో ఆయన టీవీలో కనిపించారు.

ఆలివ్‌ గ్రీన్‌ దుస్తులు ధరించిన సద్దాం ముందే తయారు చేసి పెట్టుకున్న ప్రసంగ పాఠాన్ని చదువుకుంటూ వెళ్లారు. అమెరికా, బ్రిటన్‌ సైన్యాలపై త్వరలోనే గెలిచి తీరుతామని, విజయం తమదే అవుతుందని ఆయన అన్నారు. వారిని తిప్పికొట్టండి, దుష్టశక్తిని తిప్పికొట్టండి, దాంతో దుష్టశక్తి ఓడిపోతుంది అని ఆయన పిలుపునిచ్చారు.

ఈ నిర్ణయాత్మక కాలంలో భగవంతుడేదైతే ఆదేశించాడో అందుకు, వారి గొంతులు కోయడానికి ఇరాకీలు వరుసలో వున్నారు అని సద్దాం అన్నారు. విశ్వాసపాత్రులు గెలుస్తారు. ఈ నిర్ణయాత్మక కాలంలో మునుపటిలా శత్రువు క్షిపణులు, ఫైటర్‌ జెట్స్‌ వాడకూడదని ప్రయత్నించాడు. ఇప్పుడు దురాక్రమణకు దిగి మన భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు వచ్చాడు అని అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X