వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిఆర్‌ఎస్‌ ఢిల్లీ యాత్ర ప్రారంభం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సాధనకు తెలంగాణ రాష్ట్ర సమితి ఢిల్లీ యాత్రను ప్రారంభించింది. హైదరాబాద్‌ శివారులోని ఫలక్‌నుమా ప్యాలెస్‌ వద్ద ర్యాలీని టిఆర్‌ఎస్‌ నాయకుడు ఎ. నరేంద్ర లాంఛనంగా ప్రారంభించారు. టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌ రావు నేతృత్వంలో వందలాది వాహనాల ర్యాలీ హైదరాబాద్‌లోని చార్మినార్‌, మొజంజాహీ మార్కెట్ల మీదుగా మెదక్‌ జిల్లాలోకి ప్రవేశించింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును ఎవరూ అడ్డుకోలేరని చంద్రశేఖర్‌ రావు ఈ సందర్భంగా అన్నారు. తెలంగాణ నినాదాన్ని ఢీల్లీలో జాతీయ పార్టీల నాయకులందరికీ వినిపిస్తామని ఆయన అన్నారు. జాతీయ నాయకులు తెలంగాణ రాష్ట్రం ఆవశ్యకతను గుర్తిస్తారనే విశ్వాసం తమకు ఉన్నదని ఆయన చెప్పారు. రాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్‌ను కలిసి వినతిపత్రం సమర్పిస్తామని ఆయన చెప్పారు. ఈ నెల 27వ తేదీన రామ్‌లీలా మైదానంలో జరిగే సభలో లోక్‌జనశక్తి నాయకుడు రాంవిలాస్‌ పాశ్వాన్‌, జార్ఖండ్‌ నేత శిబుసొరేన్‌ మాట్లాడుతారని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X