వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హరేన్ పాండ్య దారుణ హత్య
అహ్మదాబాద్: గుజరాత్ మాజీ హోంశాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత కు గురయ్యారు. బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు ఆయన్ని గుర్తు తెలయని దుండగులు తుపాకులతో కాల్చిచంపారు. వెంటనే ఆయన్ని వి.ఎస్. ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రాణాలు కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో ఆయన్ని మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు మధ్యాహ్నం 11.45 నిమిషాలకు ప్రకటించారు.
ఈ సంఘటనతో గుజరాత్ రాష్ట్రమంతటా రెడ్ అలెర్ట్ ప్రకటించారు. హరేన్ పాండ్యా ఉదయం అహ్మదాబాద్ లోని తన నివాసం సమీపంలోని లా గార్డెన్ లో జాగింగ్ చేస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో ఆయనపై కాల్పులు జరిపారు. ఇటీవల ముగిసిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి నరేంద్రమోడిని విభేదించిన కారణంగా పాండ్యకు టికెట్ లభించలేదు. పాండ్యను ఎవరు చంపింది ఇంకా తెలియరాలేదు.
Comments
Story first published: Wednesday, March 26, 2003, 23:53 [IST]