వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్థానికేతరులపై అసెంబ్లీలో దుమారం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలంగాణలో స్థానికేతర ఉద్యోగస్థులపై కాంగ్రెస్‌ సభ్యులు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశారు. స్థానికేతర ఉద్యోగులను వెంటనే బదిలీ చేయాలని డిమాండ్‌ చేస్తూ సభను స్థంభింపచేశారు. తెలంగాణలో స్థానికేతర ఉద్యోగులపై శాసనసభా కమిటీ ఇచ్చిన ఉత్తర్వును ప్రభుత్వం భేఖాతరు చేస్తోందని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన తెలంగాణ శాసనసభ్యులు చర్చను ప్రారంభించారు. దీనిపై తాము ఇచ్చిన వాయిదా తీర్మానానికి అనుమతి ఇవ్వాలని వారు పట్టుబట్టారు.

స్పీకర్‌ ప్రతిభాభారతి వారికి అనుమతి నిరాకరించడంతో సభలో గందరగోళం చెలరేగింది. 610 జీవో ప్రకారం స్థానికేతరులను తొలగిస్తామని ప్రభుత్వం మాట ఇచ్చిన రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లోని పోలీసు శాఖలో దీన్ని అమలు పర్చలేదని కాంగ్రెస్‌ సభ్యుల పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే సమాధానం ఇవ్వాలని కోరారు. మంత్రి యనమల రామకృష్ణుడు సమాధానమిస్తూ..శాసనసభా కమిటీ ఇచ్చిన నివేదక మధ్యంతర నివేదికే. పూర్తి నివేదిక వచ్చాక అమలు పర్చుతామని వివరించారు.

ఈ అంశంపై సీపీఎం నేత నోముల నర్సింహయ్య మాట్లాడుతుండగానే మైక్‌ కట్‌ కావడంతో కాంగ్రెస్‌ శాసనభ్యులు స్పీకర్‌ పోడియానికి దూసుకువెళ్ళారు. తెలంగాణపై పూర్తి స్థాయి చర్చకు సిద్దమని హోంమంత్రి దేవేందర్‌ గౌడ్‌ అన్నారు. దీనిపై ప్రత్యేక చర్చకు అనుమతి ఇవ్వాలని ఆయన స్పీకర్‌ ను కోరారు.

ప్రత్యేక చర్చకు స్పీకర్‌ ఓకే
బుధవారం సాయంత్రం అన్ని శాసనసభా పార్టీల ఫ్లోర్‌ లీడర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసి
తెలంగాణపై చర్చకు తేదీని ఖారారు చేస్తామని స్పీకర్‌ ప్రతిభాభారతి ప్రకటించారు. గురువారం చర్చను చేపట్టాలన్న హోంమంత్రి డిమాండ్‌ ను తోసిపుచ్చారు. సమావేశం అనంతరమే ఖచ్చితమైన తేదీని ప్రకటిస్తానని ఆమె పేర్కొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X