ఉత్తర తెలంగాణాలో రెడ్ అలెర్ట్
హైదరాబాద్: మంగళవారం ఆదిలాబాద్ అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో వార్ అగ్రనేత రామకృష్ణ మరణించడం వార్ కు పెద్ద దెబ్బ అని పోలీసులు అంటున్నారు. అయితే, వార్ ఇందుకు ప్రతీకార చర్యలు చేపట్టే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో రెడ్ అలెర్ట్ను ప్రకటించినట్లు బుధవారం డిజిపి పేర్వారం రాములు తెలిపారు.
వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో రామకృష్ణకు మంచి పట్టు ఉండేదని, వార్ చేపట్టిన పలు బాంబుదాడుల్లో ఆయన కీలక పాత్ర పోషించినట్లు రాములు చెప్పారు. దాదాపు 1000 కేసులు ఆర్.కెపై ఉన్నాయి. రామకృష్ణ మృతదేహంతో పాటు ఎన్ కౌంటర్ లో మరణించిన నలుగురు నక్సలైట్ల మృతదేహాలను బుధవారం మధ్యాహ్నం పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం వారి బంధువులకు అప్పగించారు.
అయితే, రామకృష్ణ ఎన్ కౌంటర్ పై పౌరహక్కుల నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తరహా హత్య అని వారు అభివర్ణిస్తున్నారు. అయితే, డీజీపీ వారి అనుమానాలను కొట్టిపారేశారు. ఇలాంటి సందేహ దేహాలు ఒక సారి అడవుల్లోకి స్వయంగా వెళ్ళి పరిశీలిస్తే మంచిదని ఆయన సలహా ఇచ్చారు.