వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నేను సీఎంను కాను: చంద్రశేఖరరావు
న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తొలి ముఖ్యమంత్రి పదవిని దళితుడే చేపడుతాడని తెలంగాణ రాష్ట్రసమితి అధినేత కె.చంద్రశేఖరరావు మరోసారి స్పష్టం చేశారు. మూడు రోజుల క్రితం ప్రారంభించిన ఛలో ఢిల్లీ ర్యాలీ ముగింపు సందర్భంగా గురువారం న్యూఢిల్లీలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి రాంవిలాస్ పాశ్వాన్, లోక్ శక్తి, లోక్ దళ్ నేతలు హాజరయ్యారు.
వారంతా ప్రత్యేక తెలంగాణ ఏర్పడుతుందని, చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. వెంటనే చంద్రశేఖర్ రావు తొలి తెలంగాణ ముఖ్యమంత్రి తాను కానని, దళిత నేతే ఆ పదవి చేపడుతాడని వారు మాటలకు అడ్డుపడుతూ తెలిపారు. ప్రత్యేక తెలంగాణ కచ్చితంగా ఏర్పడుతుందని చంద్రశేఖర్ రావు ఈ సందర్భంగా విశ్వాసం వ్యక్తం చేశారు. ఛలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతమైందన్నారు.
Comments
Story first published: Thursday, March 27, 2003, 23:53 [IST]