ప్రుడెన్షియల్ బ్యాంకు పున:ప్రారంభం
హైదరాబాద్: వారం రోజుల క్రితం కార్యకలాపాలు నిలిపేసిన ప్రుడెన్షియల్ బ్యాంకు గురువారం నుంచి తిరిగి ప్రారంభమైంది. బ్యాంకు ఛైర్మన్ గా కొత్తగా నియమితులైన టి.సత్యనారయణరావు, బ్యాంకు ఉద్యోగుల సంఘం తీసుకున్న నిర్ణయం ప్రకారం కలాపాలను ప్రారంభించారు. సత్యనారయణరావు బ్యాంకు ఉద్యోగుల అందరితో గురువారం సమావేశమయ్యారు. బ్యాంకును తిరిగి సక్రమదారిలో పెట్టేందుకు చర్యలు ప్రారంభం అయ్యాయి.
బుధవారం బ్యాంకు ఉద్యోగుల చేతిలో దెబ్బలు తిన్న మాజీ వైస్ ఛైర్మన్ సి.ఎం.ప్రకాష్ రావు, మాజీ ఛైర్మన్ బూరుగు మురళీధర్ లు గురువారం విలేకరుల సమావేశంలో తమపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చారు. మరోవైపు, డిపాల్టర్ల అందరికీ రోజుకు 50 చొప్పున నోటీసుల జారీని గురువారం నుంచి ప్రారంభించారు. డిపాల్టర్లు అందరూ కనీసం 50 శాతం వెంటనే చెల్లించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ నోటీసుల్లో స్పష్టం చేశారు.