వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామకృష్ణకు కన్నీటి వీడ్కోలు

By Staff
|
Google Oneindia TeluguNews

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ అడవుల్లో మంగళవారం నాడు జరిగిన ఎన్‌ కౌంటర్‌ లో మరణించిన వార్‌ సెంట్రల్‌ కమిటీ సభ్యుడు రామకృష్ణ మృతదేహానికి గురువారం అంత్యక్రియలు జరిగాయి. బుధవారం నాడే పోలీసులు రామకృష్ణ మృతదేహాన్ని వారు తల్లితండ్రులకు అప్పగించగా, గురువారం సాయంత్రం స్వగ్రామం మొగిలిచర్లలో అంత్యక్రియలు చేపట్టారు. అంత్యక్రియలకు ప్రజాగాయకుడు గద్దరు, పౌరహక్కుల నేత వరవరరావు తదితరులు హాజరయ్యారు.

శవయాత్రకు భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు. అయితే, గద్దరు, వరవరరావుల వాహనాన్ని పోలీసులు నిలిపి తనీఖీ చేశారు. దీన్ని వారు వ్యతిరేకించారు. కాసేపు, సి.ఐకి, వారికి గొడవ జరిగింది. శవయాత్ర సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ గుర్తుతెలియని వ్యక్తలు కొందరు గాలిలోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపి రామకృష్ణ మృతదేహానికి గౌరవవందనం సమర్పించారు.

ఆర్కేను పోలీసులే హత్య చేశారని వరవరరావు ఆరోపించారు. కాసేపు చంద్రన్న, రాజన్న ...భిన్నమైన పేర్లు చెప్పి తమ భయాన్ని కప్పిపుచ్చుకునేందుకు పోలీసులు ప్రయత్నించడాన్ని బట్టే అది పోలీసుల హత్య అని తెలుస్తోందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X