కరెంట్పై కాంగ్రెస్, సిపిఎం వాకౌట్
హైదరాబాద్:
వ్యవసాయానికి
విద్యుత్
సరఫరాపై
గురువారం
శాసనసభలో
ప్రతిపక్షాలు
ప్రభుత్వాన్ని
నిలదీశాయి.
ప్రభుత్వం
నుంచి
సంతృప్తికరమైన
సమాధానం
రాకపోవడంతో
కాంగ్రెస్,
సిపిఎం
వాకౌట్
చేశాయి.
వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ సరఫరా సమయాన్ని రోజుకు 9 గంటల నుంచి 7 గంటలకు కుదించారా లేదా అని కాంగ్రెస్, సిపిఎం అడిగిన ప్రశ్నకు విద్యుచ్ఛక్తి మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు సమాధానం దాటవేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఈ విషయమై ఐఎఎస్ అధికారి చేత విచారణ జరిపించాలని లేదా తమతో మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు పరిశీలనకు రావాలని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పి) నాయకుడు డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు.
అయితే సుబ్బారాయుడు ఈ విషయాలేవీ పట్టించుకోకుండా ఆవేశపూరిత ప్రసంగం చేశారు. తాము పంటలను కాపాడడానికి ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని ఆయన దుయ్యబట్టారు.