వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరెంట్‌పై కాంగ్రెస్‌, సిపిఎం వాకౌట్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరాపై గురువారం శాసనసభలో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. ప్రభుత్వం నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో కాంగ్రెస్‌, సిపిఎం వాకౌట్‌ చేశాయి.

వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్‌ సరఫరా సమయాన్ని రోజుకు 9 గంటల నుంచి 7 గంటలకు కుదించారా లేదా అని కాంగ్రెస్‌, సిపిఎం అడిగిన ప్రశ్నకు విద్యుచ్ఛక్తి మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు సమాధానం దాటవేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఈ విషయమై ఐఎఎస్‌ అధికారి చేత విచారణ జరిపించాలని లేదా తమతో మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు పరిశీలనకు రావాలని కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ (సిఎల్‌పి) నాయకుడు డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి అన్నారు.

అయితే సుబ్బారాయుడు ఈ విషయాలేవీ పట్టించుకోకుండా ఆవేశపూరిత ప్రసంగం చేశారు. తాము పంటలను కాపాడడానికి ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్‌ రాజకీయం చేస్తోందని ఆయన దుయ్యబట్టారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X