వాజ్పేయి పాలన సుదీర్ఘం: అద్వానీ
న్యూఢిల్లీ:
ప్రధాని
అటల్
బిహారీ
వాజ్పేయి
దేశాన్ని
సుదీర్ఘ
కాలం
పరిపాలిస్తారని
ఉప
ప్రధాని
ఎల్.కె.
అద్వానీ
అన్నారు.
కేంద్రంలో
సంకీర్ణ
ప్రభుత్వం
మనుగడపై
ప్రజల్లో
ఉన్న
సందేహాలను
జాతీయ
ప్రజాస్వామ్య
కూటమి
(ఎన్డిఎ)
ప్రభుత్వం
పారద్రోలిందని
ఆయన
అన్నారు.
ఈ రోజుకు ఎన్డిఎ ప్రభుత్వం ఐదేళ్ల పది రోజులు పూర్తి చేసుకున్నదని, వాజ్పేయి నేతృత్వంలో దేశంలో మరింత కాలం పరిపాలన సాగగలదనే విశ్వాసం తనకు ఉన్నదని, వాజ్పేయి చాలా కాలం ప్రధానిగా కొనసాగుతారని ఆయన అన్నారు. ఎన్డిఎ ర్యాలీని ఉద్దేశించి ఆయన శనివారం ప్రసంగించారు.
ఐదేళ్లే క్రితం ప్రభుత్వం ఏర్పాటయినప్పుడు ప్రజల్లో అనేక సందేహాలు ఉండేవని, కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం సజావుగా సాగుతుందనే విశ్వాసం వారికి ఆ సమయంలో లేదని ఆయన అన్నారు. ఎన్నో ఏళ్ల అనుభవం దృష్ట్యా ఏకపార్టీ పాలన మాత్రమే ఐదేళ్లు కొనసాగుతుందనే నమ్మకం ప్రజలకు ఉండేదని ఆయన అన్నారు. ఎన్నడూ లేనంత పెద్ద సంకీర్ణాన్ని వాజ్పేయి ముందుకు నడిపిస్తున్నారని, ఈ విధమైన ప్రభుత్వాన్ని నడిపించిన కొద్ది మంది ప్రధానులు మాత్రమే స్థిరత్వాన్ని సాధించారని, గత పదేళ్లలో ఏడుగురు ప్రధానులను దేశం చూసిందని ఆయన అన్నారు.