వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాసుబ్రహ్మనంద భూమిపై దుమారం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హైదరాబాద్‌ లోని జూబ్లీహిల్స్‌ ప్రాంతంలో ఉన్న వంద ఎకరాల కాసు బ్రహ్మనందరెడ్డి జాతీయ పార్క్‌ లోని కొంతభాగాన్ని ఒక బహుళజాతి సంస్థకు ప్రభుత్వం కట్టబెట్టనుందని వచ్చిన వార్తలపై అసెంబ్లీలో దుమారం రేగంది. దీనిపై ప్రభుత్వం ఓ ప్రకటన ఇవ్వాలని శనివారం విపక్షాలు పట్టుబట్టాయి. ఈ పార్క్‌ లోని ఎనిమిది ఎకరాల భూమిని ఒబెరాయ్‌ హోటల్‌ కు కట్టబెట్టాలా ప్రభుత్వం జీవీ జారీ చేసిందని శనివారం ఓ పత్రిక ప్రచురించింది. శనివారం ఉదయం అసెంబ్లీ ప్రారంభం కాగానే ఈ అంశంపై కాంగ్రెస్‌, సీపీఎంలు వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి.

స్పీకర్‌ ప్రతిభాభారతి వాయిదాతీర్మానానికి నిరాకరించడంతో కాంగ్రెస్‌ సభ్యులు పోడియం వైపు దూసుకెళ్ళారు. కనీసం దీనిపై ప్రభుత్వం ప్రకటన చేయాలని సీఎల్పీ నేత వై.ఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. వై.ఎస్‌, కాంగ్రెస్‌ సభ్యుల డిమాండ్‌ ను రెవిన్యూశాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు తోసిపుచ్చారు.

కాంగ్రెస్‌ వారు జీవోను ముందు చదివి అనంతరం చర్చ ప్రారంభించాలని, సభను తప్పుదోవ పట్టించేందుకు, సమయం వృధా చేసేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. 40 నిమిషాల పాటు జరిగిన ఈ చర్చ చివరికి - ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగే చర్చలో దీనిపై ప్రభుత్వం వివరణ ఇస్తుందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించడంతో సభ సద్దుమణిగింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X