వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మాది పవిత్ర పాలన: వాజ్పేయి
న్యూఢిల్లీ:
ప్రజాజీవితంలో
అవినీతిపై
ప్రధాని
అటల్
బిహారీ
వాజ్పేయి
తీవ్రంగా
ధ్వజమెత్తారు.
రాజకీయ
పరిశుద్ధతకు
తమ
ప్రభుత్వం
కట్టుబడి
ఉన్నదని,
తమపై
ఎవరూ
వేలెత్తి
చూపలేరని
ఆయన
అన్నారు.
రాజకీయాలు అధికారాన్ని హస్తగతం చేసుకునే క్రీడగా మారాయని, అధికారం సంపదను పోగుచేసుకునే సాధనంగా మారిందని ఆయన అన్నారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డిఎ) ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం జరిగిన ర్యాలీని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అన్ని కుంభకోణాలపై తమ ప్రభుత్వం విచారణ జరిపించిందని, దేన్నీ వదిలేయలేదని, కొన్ని కేసులకు సంబంధించి దర్యాప్తు జరుగుతోందని ఆయన చెప్పారు. అవినీతి అంశాల విషయంలో తమవైపు ఎవరూ వేలెత్తి చూపలేరని, తమ జీవితం పవిత్రంగా ఉండాలని ప్రతిజ్ఞ తీసుకున్నామని ఆయన చెప్పారు.
Comments
Story first published: Saturday, March 29, 2003, 23:53 [IST]