వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా! నీతులు చెప్పొద్దు: సిన్హా

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌ తో భారత్‌ తిరిగి చర్చలు ప్రారంభించాలని అమెరికా చేసిన సూచనను భారత్‌ కొట్టిపారేసింది. 24 మంది కాశ్మీర్‌ పండిట్ల ఊచకోత నేపథ్యంలో తిరిగి చర్చలు చేపట్టాలన్న అమెరికా సూచన అర్ధరహితమన్నారు. మేం(భారత్‌) కూడా వారిని(అమెరికా) ఒసామా బిన్‌ లాడెన్‌, సద్దాం హుస్సేన్‌ లతో చర్చల ద్వారా పరిష్కారం సాధించుకోమని సూచిస్తే ఎలా ఉంటుంది? అని భారత విదేశాంగ శాఖ మంత్రి యశ్వంత్‌ సిన్హా ప్రశ్నించారు.

పాక్‌ ప్రేరిపిత ఉగ్రవాదానికి ఫుల్‌ స్టాప్‌ పెట్టేలా పాశ్చాత్య దేశాల కూటమి పాక్‌ పై ఒత్తిడి తీసుకురానంత కాలం తీవ్రవాదంపై అంతర్జాతీయ పోరు విజయవంతం కాదని ఆయన శనివారం బీబీసీ టెలివిజన్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యలో స్పష్టం చేశారు.

గతవ వారం హిందువుల కోచ అనంతరం చర్చలు జరపాలన్న సూచన తప్పుదారి పట్టిస్తుందన్నారు. అయితే, సరిహద్దు తీవ్రవాదం రూపుమాపేలా చర్యలు తీసుకోవాలని పాక్‌ ను సూచిస్తూ మార్చి 27న అమెరికా విదేశాంగ కార్యదర్శి కొలిన్‌ పావెల్‌, బ్రిటిష్‌ విదేశాంగ కార్యదర్శి జాక్‌ స్ట్రాలు జారీ చేసిన సంయుక్త ప్రకటనపై సిన్హా సంతృప్తి వ్యక్తం చేశారు.

పాక్‌ తో భారత్‌ ఒక్కతే స్వయంగా డీల్‌ చేయాలని తాము నిర్ణయాకొచ్చినట్లు ఆయన చెప్పారు. ఇరాక్‌ పై అమెరికా యుద్దం విషయంలో అమెరికాకు భారత్‌ సహాయనిరాకరణ చేపడుతోందని వచ్చిన వార్తలను ఆయన కొట్టిపారేశారు. వాళ్లు ఎటువంటి సహాయాన్ని అడగలేదు. కాబట్టి మేం ఏమీ ఇవ్వలేదు. అంతే అని ఆయన స్పష్టం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X